News March 27, 2024

KMR: రహదారులు కన్నీరు పెట్టిస్తున్నాయి..

image

కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్త మోడుతూ..కన్నీరు పెట్టిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కడో చోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 96 ప్రమాదాలు జరగడం గమనార్హం. తాజాగా ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల పరిసర ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో హాసన్ పల్లి యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

Similar News

News September 7, 2025

నిజామాబాద్: బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

image

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.

News September 7, 2025

NZB: ఆలయాల మూసివేత

image

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.

News September 7, 2025

ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

image

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.