News November 3, 2025

KMR: రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి: MLC

image

రేపటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బందుకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆదివారం
హైదారాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే రూ.900 కోట్లు, పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ ప్రైవేటు విద్యాసంస్థలను మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

Similar News

News November 3, 2025

హైదరాబాద్‌లో వర్షం షురూ..

image

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 3, 2025

HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

News November 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.