News February 14, 2025
KMR: విద్యార్థుల సేఫ్టీకి..జిల్లా కలెక్టర్ తొలి అడుగు..!

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలి అడుగు వేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా కామారెడ్డి జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించారు. శుక్రవారం కళాభారతిలో సమావేశం నిర్వహించి పోక్సో చట్టం పై ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోక్సో చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించారు.
Similar News
News November 5, 2025
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీనికితోడు పరివాహక ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వస్తున్న కారణంగా బుధవారం ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటనలో తెలిపారు. దిగువన నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా పశుకాపరులు, రైతులు జాగ్రత్త వహించాలన్నారు. తదుపరి సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారి కోరారు.
News November 5, 2025
VKB: ‘మా బాటలు సురక్షితంగా మారాలి’

వికారాబాద్ జిల్లాలో గుంతలతో నిండిన రోడ్లు ప్రజల జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. చెదిరిన ప్యాచ్లు, వర్షాలతో మరింత దారుణంగా మారిన మార్గాలు ప్రాణాలను తీస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిగి పర్యటనకు రానున్న సమయంలో రోడ్ల సమస్య పెద్ద పరీక్షగా మారింది. వృద్ధులు, విద్యార్థులు, రోగులు అందరి కోరిక ఒక్కటే ‘ మా బాటలు సురక్షితంగా మారాలని’ ప్రజలు కోరుతున్నారు.
News November 5, 2025
‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


