News April 2, 2025

KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

image

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

TODAY HEADLINES

image

★ ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టుల ప్రకటన
★ రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది ప్రశంసలు
★ ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
★ 15% వృద్ధి రేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
★ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
★ వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ
★ పంటల ధరల పతనంలో చంద్రబాబు రికార్డు: YS జగన్

News September 17, 2025

‘నా మిత్రుడు ట్రంప్‌’కు ధన్యవాదాలు: PM మోదీ

image

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

News September 17, 2025

ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు: DMHO

image

మహిళల ఆరోగ్య సంరక్షణకు జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల DMHO విజయమ్మ తెలిపారు. మంగళవారం వైద్య శిబిరాలకు సంబంధించి బాపట్లలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ.. శక్తివంతమైన కుటుంబం నినాదంతో జిల్లాలోని PHC, UPHCలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.