News April 2, 2025

KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

image

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడానికి కారణాలు

image

చలిని తట్టుకోవడానికి పశువులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అలాగే ఈ సమయంలో జీవాల్లో జీర్ణప్రక్రియ మందగించడం వల్ల అవి సరిగా గడ్డి, దాణా తీసుకోవు. ఫలితంగా వాటికి కావాల్సిన పోషకాలు అందవు. చలికాలంలో పచ్చిగడ్డి లభ్యత కూడా తగ్గుతుంది. పశువుల్లో ఒత్తిడి (కోల్డ్ స్ట్రెస్) కారణంగా అవి ఆహారం సరిగా తీసుకోవడానికి ఇష్టపడవు. పొదుగువాపు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.

News December 27, 2025

కేరళ రాజధానిలో కాషాయ జెండా

image

కేరళలో కాషాయ దళం సరికొత్త అధ్యాయం లిఖించింది. నాలుగు దశాబ్దాలుగా LDF ఆధిపత్యంలో ఉన్న <<18552178>>తిరువనంతపురం<<>> మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తొలిసారి మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. BJP రాష్ట్ర కార్యదర్శి, కొడుంగనూర్ కౌన్సిలర్ V.V.రాజేశ్ 51 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. LDFకి 29, UDFకి 19 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయం కేరళ రాజకీయ సమీకరణాలను మార్చే కీలక మలుపుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

News December 27, 2025

ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

image

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.