News March 13, 2025
KMR: హోలీని సురక్షితంగా జరుపుకోవాలి: SP

కామారెడ్డి జిల్లా ప్రజలు హోలీ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మద్యం మత్తులో వాహనాలు నడుపోద్దన్నారు. చెర్వుల్లో, కుంటల్లో లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదబారిన పడవద్దని సూచించారు. సురక్షితమైన రంగులను వాడి హోలీ జరుపుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
Similar News
News March 14, 2025
BREAKING: పరిగి-కొడంగల్ రోడ్డులో యాక్సిడెంట్

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పరిగి పట్టణ సమీపంలోని కొడంగల్ వెళ్లే రోడ్డులో రైస్ మిల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
పెద్దాపురం: బలవంతపు పెళ్లిపై పోలీసులకు బాలిక ఫిర్యాదు

పెద్దాపురంలో 9వ తరగతి చదువుతున్న బాలిక (14)కు నిడదవోలకు చెందిన యువకుడి(28)తో బలవంతంగా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. రేపు(15న) నిశ్చితార్థం కూడా పెట్టేశారు. అయితే తాను పెళ్లి చేసుకోనని, చదువుకుంటానని బాలిక చెప్పింది. అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చిన వారు వినలేదు. దీంతో బాలిక గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వి.మౌనిక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు
News March 14, 2025
పల్నాడు: మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా సాంప్రదాయ రంగులు ఉపయోగించటం ఆరోగ్యకరమని అన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వివరించారు. ప్రధాన కుడళ్లు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉంచడంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.