News March 1, 2025
KMR: 12579 విద్యార్థులు.. 54 సెంటర్లు

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో పదో తరగతిలో 12,579 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
Similar News
News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.


