News January 25, 2025

KMR: 1892 మంది దివ్యాంగులు గుర్తింపు

image

దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు అందించడం కోసం KMR జిల్లా సంక్షేమ అధికారి, అలీం. కో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ నెల 21 నుంచి 24 వరకు కామారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 1892 మంది దివ్యాంగులకు ఎంపిక చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తెలిపారు. వీరికి త్వరలో ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.

Similar News

News September 15, 2025

కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

image

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 15, 2025

కృష్ణ: 100 ఏళ్ల నాటి నిజాం కాలం వంతెన

image

నిజాం కాలంలో నిర్మించిన పురాతన రాతి వంతెన వందేళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గచ్చుతో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు కూడా అవసరం రాలేదు. NRPT జిల్లా కృష్ణ మండలం వాసునగర్- శక్తి నగర్ మధ్య ఈ వంతెన నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్)తో ఈ వంతెన నిర్మించారు. ఖానా మధ్యలోని రాయి భారం మోస్తుందని ఇంజినీరింగ్‌ల అభిప్రాయం. నేడు ఇంజినీర్ల దినోత్సవం.

News September 15, 2025

కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

image

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.