News March 14, 2025
KMR: 26 పాఠశాలల్లో ఏఐ పాఠాలు: కలెక్టర్

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగిత రాణా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు. జిల్లాలో 26 ప్రాథమిక పాఠశాలలను ఏఐ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ల్యాబ్ లను 15న ప్రారంభించినట్లు వివరించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఏఐ సాంకేతిక ద్వారా విద్య బోధన చేయాలని సూచించారు.
Similar News
News November 24, 2025
4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 24, 2025
ASPT: మనవడి మరణం తట్టుకోలేక నాయనమ్మ మృతి

అశ్వారావుపేట మండలం దొంతికుంటలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందాడు. మనవడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News November 24, 2025
వరంగల్: డిసెంబర్ బియ్యం కోటా విడుదల

ఉమ్మడి జిల్లాలో రేషన్ షాపులకు సన్న బియ్యం అలాట్ అయ్యింది. HNK జిల్లాకు 4,789.54 మెట్రిక్ టన్నులు, జనగామ 3,548.47, భూపాలపల్లి 2,526.02, మహబూబాబాద్ 5,209.91, ములుగు 1,906.28, WGL 5,509.8 మెట్రిక్ టన్నులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,124.53 మెట్రిక్ టన్నుల కోటాను డిసెంబరు కోసం విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలోనే ముందుగానే సన్నబియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు.


