News October 26, 2024

KMR: 27 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలలో పని చేస్తున్న 27 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఉత్తర్వులు వెలువరించారు. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లోకి చేర్చుకొని సమ్మతిని నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 24, 2025

NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్‌’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

News December 24, 2025

NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్‌’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

News December 24, 2025

NZB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు NZB జిల్లా గురుకుల పాఠశాలల సీనియర్ ప్రిన్సిపల్ గోపిచంద్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.