News April 4, 2025
KMR: 3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం 3 నెలల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 136 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రాణాంతకమైన ప్రమాదాల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ప్రాణాంతకం కానీ ప్రమాదాల్లో..105 మంది గాయపడ్డారు. మరో 7 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. జిల్లా పోలీసు శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పై వివరాలు వెల్లడయ్యాయి.
Similar News
News February 22, 2026
సంగారెడ్డి: త్వరలోనే రూ.20,737 కోట్లతో RRR పనులు

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్పల్లి వరకు 161.5 కి.మీల మేర ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
News February 22, 2026
ఫేక్ వార్తలు నమ్మొద్దు: బాపట్ల కలెక్టర్

సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభమయ్యాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అప్లికేషన్ ఫారాలను నమ్మవద్దని సూచించారు. పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, భార్యకు వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రమే ప్రస్తుతం ఉందన్నారు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చేవరకు వదంతులు నమ్మొద్దని కోరారు.
News February 22, 2026
28న GVMC కౌన్సిల్ చివరి సమావేశం

GVMC కౌన్సిల్ సమావేశం ఈనెల 28న జరగనుంది. 37 అంశాలతో అజెండాను సిద్ధం చేసి కార్పొరేటర్లకు అందజేశారు. విద్యుత్ విభాగంలోని ఒప్పంద కార్మికులను కొనసాగించేందుకు వేతనాల మంజూరు ప్రతిపాదించారు. పారిశుద్ధ్యం, భూగర్భ మురుగునీటి విభాగ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయనున్నారు. 81వ వార్డులో పైపులైన్ల మార్పు, 95వ వార్డులో రిటైనింగ్ వాల్, 1వ వార్డులో కాలువలు, 71వ వార్డులో బీటీ రహదారి పనులు అజెండాలో చేర్చారు.


