News January 26, 2025
KMR: 4 పథకాలు ప్రారంభోత్సవం.. గ్రామాలు ఇవే..!

KMR జిల్లాలో ఆదివారం నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చిన్న నాగరం, ర్యాగట్లపల్లి, శివార్ రాంరెడ్డి పల్లి, గుండెకల్లూర్, రైతు నగర్, సీతారాం పల్లి, బ్రాహ్మణపల్లి, బంగారపల్లి, గూడెం, ఎల్లారం, రాజ్ కాన్ పేట్, రాచూర్, అచైపల్లి, రాముల గుట్ట తండా, సుల్తాన్ నగర్, చిన్న తక్కడ్ పల్లి, హస్నాపూర్, నడిమి తండా, కన్నాపూర్ తండా, వజ్జేపల్లి ఖుర్దు, సంతాయి పెట్, మల్లాయిపల్లి గ్రామాలను ఎంపిక చేశారు.
Similar News
News November 21, 2025
రాజీనామా యోచనలో కడియం..?

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్కు గ్రౌండ్లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.
News November 21, 2025
1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
News November 21, 2025
నల్గొండ: లంచగొండి అధికారులు.. 11 నెలల్లో 15 కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న లంచగొండి ప్రభుత్వ అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంటూ దడ పుట్టిస్తోంది. నెలనెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా కొందరు అధికారులు అత్యాశకు పోయి, ప్రతీ పనికి ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 15 ఏసీబీ కేసులు నమోదవడం గమనార్హం.


