News September 20, 2025

KMR: 46% నేరాల ఛేదన.. 42% సొత్తు రికవరీ

image

కామారెడ్డి జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో విశేష కృషి చేస్తున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘Chase, Catch, Solve’ కు చెందిన కొత్త పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 46% ఆస్తి సంబంధిత నేరాలను ఛేదించి, 42% చోరీ సొత్తును రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, UPలకు చెందిన 10 అంతరాష్ట్ర గ్యాంగ్‌లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.

News September 20, 2025

రక్షణే లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు: కమిషనర్

image

ఆపరేషన్ లంగ్స్-2.0తో పాదచారుల భద్రత, వాహనదారుల రక్షణ లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు చేపడుతోందని కమీషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లు, జంక్షన్లపై అనధికార వ్యాపారాలు, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోబడతాయన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసినవారికి వెండింగ్ జోన్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆక్రమణల రహిత పరిశుభ్రమైన నగరం కోసమే ఈ కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.