News October 25, 2025
KMR: 49 దుకాణాలు.. 1,502 ఆశావహులు

వైన్స్ షాపు దరఖాస్తులకు సంబంధించి గడువు గురువారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 1,502 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు.
కామారెడ్డి: 15 షాపులకు 467 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 249 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 233 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 317 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 236 దరఖాస్తులు వచ్చాయన్నారు.
Similar News
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
News October 25, 2025
లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్లో ఓ స్కూల్ ఈవెంట్కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.
News October 25, 2025
MBNR-డోన్ రైల్వే సెక్షన్ అప్గ్రేడేషన్కు ఆమోదం

MBNR-డోన్ రైల్వే సెక్షన్లో ఆధునిక 2×25 కిలోవోల్ట్ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ మార్గం మరింత శక్తివంతమైన రైల్వే మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్కు రూ.122.81 కోట్లు వ్యయం కానుంది. సుమారు 184 కిలోమీటర్ల రూట్ పొడవులో ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను 2×25 KV సిస్టమ్గా అప్గ్రేడ్ చేయనున్నారు.


