News February 4, 2025

KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.

Similar News

News December 13, 2025

తిరుమల కల్తీ నెయ్యి.. నిందితులు ఏం చెప్పారు.?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యం కస్టడీ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కల్తీ నెయ్యి ట్యాంకులు ఎలా వచ్చాయి, ఎవరెవరు వచ్చే వాళ్లు, వారు మీతో ఎలా స్పందించే వారిని ప్రశ్నించారని తెలుస్తోంది. ఏ16 కూడా శుక్రవారం అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని సమాచారం. కాగా వైద్య పరీక్షలు అనంతరం వారిని నెల్లూరు జైలులో అప్పగించారు.

News December 13, 2025

డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?

image

డెలివరీ తర్వాత పిల్లలు చాలాకాలం రాత్రిళ్లు లేచి ఏడుస్తుంటారు. అయితే దీనికి డ్రీం ఫీడింగ్ పరిష్కారం అంటున్నారు నిపుణులు. డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. ముందు బేబీ రోజూ ఒకే టైంకి పడుకొనేలా అలవాటు చెయ్యాలి. తర్వాత తల్లి నెమ్మదిగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బిడ్డ రాత్రంతా మేలుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News December 13, 2025

మరీ కాకతీయ సంగతేందీ..?

image

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరీలూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.దీనిపై మీ కామెంట్?