News February 4, 2025
KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.
Similar News
News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
News February 11, 2025
హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ

అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.
News February 11, 2025
‘మద్యం’పై మాట తప్పిన ప్రభుత్వాలు.. మీరేమంటారు?

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఫైరవుతున్నారు. APలో మద్యం ధరలు పెంచబోమని, తగ్గిస్తామని CM CBN, కూటమి నేతలు చెప్పి ఇప్పుడేమో బాటిల్పై రూ.10 పెంచారని మండిపడుతున్నారు. TGలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని JANలో CM రేవంత్ ప్రకటించారు. నెల తిరక్కుండానే 15% పెంచి మాట తప్పారని దుయ్యబడుతున్నారు. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి?