News October 13, 2025
KMR: 9 ఏళ్లు గడిచినా.. వసతుల విస్మరణ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత పాలన ప్రజలకు చేరువైంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు కావడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అయితే, జిల్లాల పునర్విభజన జరిగి 9 ఏళ్లు గడిచినా, కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని అనేక ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. ఎంతో ఆశయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించినా, కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది.
Similar News
News October 13, 2025
విమానాలు తనిఖీ చేయండి.. AIR INDIAకి DGCA ఆదేశం

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్(RAT) సిస్టమ్ను పరిశీలించాలని DGCA ఆదేశించింది. ఇటీవల AIR INDIA డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో అకారణంగా RAT యాక్టివేట్ అయ్యింది. సాధారణంగా రెండు ఇంజిన్స్ ఫెయిలైనప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే DGCA దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ఘటనలు, దానిని రెక్టిఫై చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని బోయింగ్ సంస్థను కూడా కోరింది.
News October 13, 2025
APPLY NOW: BELలో 88 పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 88 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్(49) పోస్టులకు అప్లైకి ఈనెల 30 ఆఖరు తేదీ కాగా.. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్(9) పోస్టులకు ఈనెల 28, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు(30) ఈనెల 29 చివరి తేదీ. పోస్టును బట్టి ITI, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://bel-india.in/
News October 13, 2025
మంత్రాలయంలో 727 టీచర్ పోస్టులు భర్తీ

మంత్రాలయం నియోజకవర్గానికి అత్యధికంగా 727 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం హర్షనీయమని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా తన నియోజకవర్గంలో ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంపై మంత్రి లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రాలయంలో 121, పెద్దకడబూరులో 92, కోసిగిలో 256, కౌతాళంలో 257 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.