News February 7, 2025
KMR: BC డిక్లరేషన్ను తుంగలో తొక్కారు: జీవన్ రెడ్డి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్ను స్థానిక ఎన్నికల్లో నిలదీయాలని ఆర్మూర్ BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. NZB పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కామాను చెరిపేసి ఫుల్ స్టాఫ్ ఎందుకు పెట్టారో బీసీ కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరులో కాంగ్రెస్ జీరో కావడం ఖాయమన్నారు.
Similar News
News February 8, 2026
చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.
News February 8, 2026
నిర్మల్: ‘పోస్టల్ బ్యాలెన్స్ సద్వినియోగం చేసుకోండి’

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈనెల 8, 9వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల సహాయ అధికారి తెలిపారు. నిర్మల్, భైంసా మున్సిపల్ కార్యాలయాలు, ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 8, 2026
గారెపల్లిలో లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం

గారెపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మృతుడిని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజయ్యగా గుర్తించారు. రాజయ్య ఆత్మహత్య చేసుకుందామనే ప్రయత్నంలో ముందుగా ఆర్టీసీ బస్సు కింద పడిపోగా, డ్రైవర్ తప్పించడంతో వెనుక వస్తున్న లారీ కింద పడి మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


