News March 31, 2025
KMR: BC, SC, ST JAC ఏర్పాటు

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణలో సామాజిక న్యాయం కోసం BC, SC, ST రాజ్యాధికార JAC నూతన వేదిక ఏర్పాటు’ కార్యక్రమంలో DSP కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర అగ్రవర్ణాల కన్నా తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల చేతిలోనే బహుజన సమాజం ఎక్కువగా మోసపోయిందన్నారు. అందుకే అగ్రకులాల కబంధహస్తాల నుంచి అణగారిన వర్గాల ప్రజలను విడిపించి స్వతంత్రులను చేయడానికే JAC ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 15, 2025
WGL: వరుస రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో రాజయ్య బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. రఘునాథపల్లి వద్ద గూడ్స్ వాహనం ఢీకొనగా రాపాక వినోద్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దుగ్గొండి దగ్గర గృహప్రవేశానికి వెళ్తున్న హనుమాయమ్మ లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు సహా గాయపడ్డారు.
News November 15, 2025
ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
News November 15, 2025
కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.


