News December 30, 2024

KMR: DEC 31st.. రూల్స్ మస్ట్: ఎస్పీ

image

ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిబంధనలు పాటిస్తూ..న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా SP సింధు శర్మ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కట్టింగ్, అల్లర్లకు పాల్పడడం వంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డీజేలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆరోజు రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News November 14, 2025

వన్ వే సిస్టమ్‌ను పరిశీలించిన నిజామాబాద్ సీపీ

image

నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దేవీ రోడ్డులో వన్ వే సిస్టమ్ అమలు పరిస్థితిని సీపీ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వన్‌వే అమలుతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ప్రత్యక్షంగా ఆరా తీశారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలు, బై లెన్లు, గంజ్-గాంధీచౌక్ ప్రాంతాల ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ పాల్గొన్నారు.

News November 13, 2025

భీమ్‌గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

image

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

News November 13, 2025

నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్

image

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.