News April 3, 2025
KMR: KCRతో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ త్వరలో నిర్వహించనున్న రజతోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్ పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
ఆల్టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.
News November 27, 2025
పార్టీలకు అస్త్రంగా మారిన గుంపుల చెక్ డ్యాం

తనుగుల చెక్ డ్యాం కుంగుబాటు ఘటనను ప్రధాన పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ ఆయా పార్టీల నేతలు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నాణ్యతాలోపం వల్లే అంటూ BJP నేతలు ఆరోపిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పటి ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాలు చేసిందంటూ ఇటు CONG ఆరోపిస్తోంది.
News November 27, 2025
BREAKING.. కాళోజీ ఎగ్జామినేషన్ గది సీజ్!

డబ్బులు తీసుకొని <<18400179>>మార్కులు కలిపిన<<>> ఉదంతంపై చర్యలు చేపట్టారు. వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యా ఎగ్జామినేషన్ బ్రాంచ్ గదిని, కంప్యూటర్లను, స్కానర్లను సీజ్ చేశారు. నలుగురు పీజీ విద్యార్థుల రీకౌంటింగ్లో మార్కులు కలపాలని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్గా విచారణ చేపట్టింది.


