News February 1, 2025

KMR: POS యంత్రాల ద్వారా ఋణాలు వసూలు చేయాలి: కలెక్టర్

image

స్త్రీ నిధి ఋణాలు POS మిషన్స్ ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో POS మిషన్లను సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ నిధికి సంబంధించిన ఋణాలు బ్యాంకులకు వెళ్లకుండా POS యంత్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, రీజినల్ మేనేజర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

ఐదు దేశాలతో ‘C5’కు ప్లాన్ చేస్తున్న ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు శక్తిమంతమైన దేశాలతో ‘C5’ అనే కొత్త వేదికను ఏర్పాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్‌లతో ఈ గ్రూప్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ధనిక, ప్రజాస్వామ్య దేశాలకే పరిమితమైన ‘G7’కు భిన్నంగా, కోర్ ఫైవ్ (C5) దేశాలు ఇందులో ఉంటాయి. తద్వారా యూరప్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 12, 2025

తండ్రి ప్రేమ అంటే ఇదే❤️

image

కొడుకు భవిష్యత్తు కోసం ఓ తండ్రి చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్లే ఇండిగో విమానం రద్దవడంతో కొడుకు 12th పరీక్ష మిస్సవుతుందనే ఆందోళనతో ఆ తండ్రి ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు. రాత్రంతా మేల్కొని 800kms స్వయంగా కారు నడిపారు. కొడుకు పరీక్ష సజావుగా రాశాకనే ఆ తండ్రి మనసు కుదుటపడింది. పిల్లల కోసం తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధపడతారని ఈ ఘటనే నిరూపించింది.

News December 12, 2025

కాలుష్య సమస్యపై చర్చ కోరిన రాహుల్.. అంగీకరించిన కేంద్రం

image

దేశంలో గాలి కాలుష్యం పెరిగిపోతోందని, పరిష్కార మార్గాలపై చర్చించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ‘పిల్లలకు లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. గాలి పీల్చుకోవడానికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు’ అని చెప్పారు. గాలి కాలుష్య సమస్యపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ దానికి సమయం ఇస్తుందని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరన్ రిజిజు తెలిపారు.