News February 1, 2025
KMR: POS యంత్రాల ద్వారా ఋణాలు వసూలు చేయాలి: కలెక్టర్

స్త్రీ నిధి ఋణాలు POS మిషన్స్ ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో POS మిషన్లను సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ నిధికి సంబంధించిన ఋణాలు బ్యాంకులకు వెళ్లకుండా POS యంత్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, రీజినల్ మేనేజర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ నేడు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.
News March 12, 2025
NLG: GGHలో భద్రత డొల్ల!…

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
News March 12, 2025
ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు జి. జయ లక్ష్మి (IAS) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది