News October 20, 2025
KMR: RTA చెక్పోస్ట్లపై ACB మెరుపు దాడి (UPDATE)

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్పోస్ట్పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్పోస్ట్లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.
Similar News
News October 20, 2025
త్వరలో వారికి ప్రత్యేక పింఛన్లు: మంత్రి కందుల

AP: రాష్ట్రంలోకి కళాకారులందరికీ త్వరలోనే ప్రత్యేక పింఛన్లను తిరిగి అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి ఉగాది, కళారత్న పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు.
News October 20, 2025
దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.