News March 23, 2025
KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
బాసర గోదావరిలో మహిళ మృతి.. వివరాలు ఇవే!

బాసర గోదావరిలో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతురాలిని ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన అనురాధ (35)గా గుర్తించారు. ఆమెకు భర్త, కుమారుడు, కూతురు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ప్రభుత్వాసుపత్రి తరలించామన్నారు. మృతురాలి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News March 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 26, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.03 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.41 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 26, 2025
ADB: తల్వార్తో INSTAలో పోస్ట్.. వ్యక్తిపై కేసు

తల్వార్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.