News February 10, 2025
KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195036238_50093551-normal-WIFI.webp)
ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ వివరించారు.
Similar News
News February 11, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739253758459_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు తేజ మిర్చి ధర తగ్గగా మిగతా మిర్చి ధరలు పెరిగాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.13,400 పలకగా.. నేడు రూ.13,200 పలికింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.13,350 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,100 ధర రాగా.. ఈరోజు రూ.14,200కి చేరింది.
News February 11, 2025
NRPT జిల్లాలో అత్యధిక, అత్యల్ప ఎంపీటీసీ సీట్లు ఎక్కడో తెలుసా..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739247140756_50253107-normal-WIFI.webp)
నారాయణపేట జిల్లాలో ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట మండలంలో 17, ఉట్కూర్, దామరగిద్దలో 16, మక్తల్ 15, మరికల్, ధన్వాడలో 11, మద్దూర్ 10, నర్వ 9, మాగనూర్, కృష్ణ లో 7, గుండుమల్, కోస్గి లో 6, కొత్తపల్లి 5 ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 136 ఎంపీటీసీ స్థానాలకు, 13 జడ్పీటీసీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆశావహుల సంఖ్య అన్ని పార్టీల్లో ఎక్కువగా ఉంది.
News February 11, 2025
సిద్దిపేట: వేర్వేరుగా ముగ్గురు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248553492_1243-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కోహెడలో జీవితంపై విరక్తితో తిరుపతి రెడ్డి(50) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. హుస్నాబాద్లో కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని రాజు(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గజ్వేల్ మండల పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో రవీందర్(35) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.