News August 9, 2024
KMR: టౌన్ పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్ను ప్రారంభించిన ఎస్పీ
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ను జిల్లా SP సింధు శర్మ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SPమాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సారిగా, ఎక్కడా లేని విధంగా పట్టణ పోలీసు స్టేషన్లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ SHO చంద్ర శేఖర్ రెడ్డిని అభినందించారు.
Similar News
News October 7, 2024
నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.
News October 7, 2024
కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.
News October 7, 2024
మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.