News April 21, 2025

KMR: తేలనున్న 18469 మంది భవితవ్యం

image

TG రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు. ఈ ఏడాది జిల్లా నుంచి మొత్తం 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

Similar News

News April 21, 2025

ఖమ్మం: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు రేపు విడుదల చేయనుంది. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17,783 మందికి గాను 17,515 మంది, రెండవ సంవత్సరంలో 16,476 మందికి గాను 16,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: మంత్రి

image

వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో‌ జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.

News April 21, 2025

నీరవ్ మోదీ బ్యాంకింగ్ స్కామ్‌పై మూవీ!

image

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ జీవితాన్ని సినిమాగా తీయబోతున్నారని తెలుస్తోంది. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కుతుందని ‘పింక్‌విల్లా’ వెల్లడించింది. ‘గుల్లాక్’ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ పలాష్ వాస్వానీ దర్శకత్వం వహిస్తారట. వజ్రాల వ్యాపారిగా ఎదగడం, స్కామ్, జైలు వరకు అన్నీ విషయాలు ఈ మూవీలో ఉంటాయని చెబుతున్నారు. 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!