News March 24, 2025
KMR: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

పెండింగ్లో ఉన్న ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహశీల్దార్లు, ఆర్డీఓలును సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క్ అవుట్ ఇవ్వాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీవోలు, ఎంపీఓలు పర్యవేక్షించాలన్నారు.
Similar News
News April 1, 2025
విశాఖ మేయర్ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News April 1, 2025
ALERT: ఎండలు, పిడుగులతో వానలు

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <
News April 1, 2025
రేపు వనపర్తి బార్ నూతన పాలకవర్గం పదవీ ప్రమాణం

వనపర్తి జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం రేపు ఏప్రిల్ 1న సా. 7గంటలకు జరుగుతుందని నూతన అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జ్ ఎంఆర్ సునీత, జడ్జిలు రజిని, కవిత ,జానకి, రవికుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఛైర్మన్ సునీల్ గౌడ్,మెంబర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.