News April 6, 2025
KMR: నీళ్లు దుర్వినియోగం.. మూడు కేసులు

మిషన్ భగీరథ నీళ్లు అక్రమంగా దారి మళ్లించి దుర్వినియోగపరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లని దారి మళ్లించి దుర్వినియోగం చేసిన ఇద్దరిపై లింగంపేట్ PSలో, పెద్ద కోడప్గల్ మండలం పోచారం తండాకు చెందిన మరో వ్యక్తి పై కేసు నమోదైనట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News April 9, 2025
ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్ వచ్చేసింది

యంగ్టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ క్రేజీ అప్డేట్తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
News April 9, 2025
పరవాడ ఫార్మాసిటీలో యువకుడు మృతి

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం ఓ కంపెనీకి సంబంధించిన వ్యర్థపదార్థాల డ్రమ్ములు క్లీన్ చేస్తుండగా కెమికల్ పడి పడాల హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
News April 9, 2025
కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ICDS)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 16 పోస్టుల భర్తీకి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 16 పోస్టులకు 122 మంది దరఖాస్తు చేసుకున్నారు.