News April 14, 2025
KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
తీవ్ర పొగమంచు.. మోదీ టూర్పై ఎఫెక్ట్

తీవ్ర పొగమంచు ప్రభావం ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. ఢిల్లీ ఎయిర్పోర్టును పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకే ఆయన బయల్దేరాల్సి ఉంది. ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. కాగా ఉత్తర భారతంలో పొగమంచు వల్ల పలు రోడ్డు <<18561671>>ప్రమాదాలు<<>> చోటుచేసుకుంటున్నాయి. విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం పడింది.
News December 15, 2025
బంధాలకు భయపడుతున్నారా?

గామోఫోబియా అనేది రిలేషన్షిప్కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్మెంట్కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
News December 15, 2025
మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.


