News March 13, 2025
KMR: భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తాం: కలెక్టర్

రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో ITI ల ఏర్పాటుకు అవసరమైన రెండు ఎకరాల చొప్పున భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. బిచ్కుందలో ITI ఉందని తెలిపారు.
Similar News
News March 15, 2025
పవన్కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం <<15762616>>పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు<<>> నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్కి దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.
News March 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 15, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 15, 2025
బాసరలో వెయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు

బాసర సరస్వతి నిలయంగా పేరుగాంచిన పాపహారేశ్వర స్వామి దేవాలయం వద్ద వేయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు ఆదరణ లేకుండా నిర్లక్ష్యంగా పడి ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, స్థానిక చరిత్రకారులు శుక్రవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ చారిత్రక ఆనవాళ్లు, విగ్రహాలు, శాసనాలు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిశీలించారు.