News February 9, 2025

KMR: మార్పు డెస్క్‌ను సందర్శించిన MCH అధికారి

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం మార్పు డెస్క్ ద్వారా అందుతున్న సేవలను జిల్లా మాతా శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డా.అనురాధ సందర్శించారు. గ్రామాల నుంచి జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు, బాలింతలకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మార్పు డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

Similar News

News February 9, 2025

తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.

News February 9, 2025

బాపట్ల: 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు

image

బాపట్ల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు వచ్చినట్లు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి దేవదత్తు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని, పదో తేదీన బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారులు 10వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరుకావాలని సూచించారు.

News February 9, 2025

అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

image

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!