News March 20, 2025
KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.
Similar News
News March 21, 2025
మెదక్: పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్లతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ రంగాల్లో రూ.5857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా రూ.3732.59 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. 25-26 నాబార్డ్ వారు సిద్ధం చేసిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించారు.
News March 21, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు
News March 21, 2025
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్

రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, దీన్ని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.