News December 14, 2024

KNL: నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు

image

కర్నూలు జిల్లాలో నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేసీ కెనాల్, SRBC, తెలుగు గంగ, మైనర్ ఇరిగేషన్, మైలవరం పరిధిలోని ఆయకట్టు రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుమారు 3లక్షల మంది రైతులు నేడు ఓటేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Similar News

News December 13, 2025

కర్నూలు జిల్లాలో 8,781 కేసులు నమోదు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు.

News December 13, 2025

నేడు కర్నూలుకు మంత్రి ఆనం రాక

image

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.

News December 13, 2025

నేడు కర్నూలుకు మంత్రి ఆనం రాక

image

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.