News November 13, 2024

KNL: బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నం

image

బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. ఆమె తండ్రి వివరాల మేరకు.. కోసిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఫ్యామిలీ పత్తి పనులకు కర్ణాటక వెళ్లింది. 8వ తరగతి చదివే కుమార్తె(13)ను తాత వద్ద వదిలి వెళ్లారు. గత నెల 30న ఆమె ఇంటి బయట నిద్రిస్తుండగా ఇద్దరి సహకారంతో స్థానిక సర్పంచ్ అత్యాచారం చేయబోయాడు. అలికిడి విని తాత నిద్రలేవగా వాళ్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 27, 2025

విద్యార్థులతో కర్నూలు కలెక్టర్ మాటామంతి

image

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కార్యాలయ ఛాంబర్లో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షణపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థుల పాఠశాల సమస్యలు, పాఠ్యాంశాల బోధన, 10వ తరగతి పరీక్షలకు సిద్ధత వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ధైర్యంగా సమాధానాలిచ్చిన విద్యార్థులను అభినందించారు.

News November 26, 2025

కలెక్టర్‌ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

image

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.

News November 26, 2025

విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

image

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.