News October 31, 2025
KNL: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారి సబీహా పర్వీన్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం సీఈడీఎం ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://apcedmmwd.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.
Similar News
News November 1, 2025
అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.
News November 1, 2025
జమ్మికుంట రైల్వే ప్లాట్ఫారంపై గుర్తు తెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై గుర్తు తెలియని 50ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె బ్రౌన్ నైటీ ధరించి ఉండగా, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తింపు కార్డులు లభించలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు 9949304574, 8712658604 లకు తెలుపగలరని రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కోరారు.
News November 1, 2025
కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.


