News July 8, 2024
ప్రతి తిరస్కరణ ఆశీర్వాదం అని తెలుసుకుంటారు: ప్రశాంత్ వర్మ

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్వీర్తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 22, 2025
ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
News December 22, 2025
యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
News December 22, 2025
నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.


