News April 2, 2025
రైలులో ప్రయాణించే ముందు ఇది తెలుసుకోండి!

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే లగేజీ పరిమితులను నిర్దేశించింది. ప్రయాణ తరగతిని బట్టి లగేజీ బరువుపై రుసుము వసూలు చేస్తారు. ఒక్కరి దగ్గర AC ఫస్ట్ క్లాస్లో 70KGS, AC 2టైర్లో 50KGS, AC 3టైర్& స్లీపర్లో 40KGS, జనరల్ బోగీలో 35 కేజీల బరువు కంటే మించకూడదు. ఈ పరిమితిని మించి తీసుకెళ్లాలనుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT
Similar News
News October 16, 2025
ట్రాఫిక్లోనే జీవితం అయిపోతోంది!

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్లో ట్రాఫిక్ పెరిగిపోయింది.
News October 16, 2025
ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.
News October 16, 2025
సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో-9ను జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కాగా జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.