News April 5, 2025

KNR:టీటీడీ చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

image

కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారీ ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.రాజ్ గోపాల్ నాయుడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం టిటిడి చైర్మన్‌కు కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ ప్రత్యేక లేఖ రాశారు. పద్మానగర్‌లో పదెకరాల స్థలంలో దేవాలయ నిర్మాణానికి గతంలోనే అనుమతులు లభించినందున నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు.

Similar News

News December 11, 2025

MDK: ఆ ఊరిలో ఒక్క ఓటు తేడాతో గెలుపు

image

రేగోడ్ మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరి పండరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి హరిజన సత్తయ్య మీద ఒక ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

News December 11, 2025

VJA: గుండు కొట్టించు.. వంద సమర్పించు.!

image

భవానీ మాల విరమణకు వచ్చిన భక్తుల నుంచి కేశఖండన శాలల సిబ్బంది అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తలనీలాలు సమర్పించేందుకు టికెట్‌‌కు రూ.40 ఉన్నప్పటికీ, అదనంగా రూ.100 ఇవ్వాలని క్షవరకులు డిమాండ్ చేస్తున్నారు. ముందు డబ్బులు ఇస్తేనే గుండు చేస్తామని ఆంక్షలు పెడుతున్నారు. మైకుల్లో డబ్బులు చెల్లించవద్దని ప్రకటిస్తున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 11, 2025

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ఈ-ఆఫీస్’ శిక్షణ

image

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ జీబీఆర్.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్‌ఐసీ బృందం పోలీసు సిబ్బందికి ఈ-ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చింది. పరిపాలనలో పారదర్శకత, కాగిత రహిత సేవల కోసమే ఈ శిక్షణని అదనపు ఎస్పీ తెలిపారు.