News April 5, 2025

KNR:టీటీడీ చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

image

కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారీ ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.రాజ్ గోపాల్ నాయుడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం టిటిడి చైర్మన్‌కు కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ ప్రత్యేక లేఖ రాశారు. పద్మానగర్‌లో పదెకరాల స్థలంలో దేవాలయ నిర్మాణానికి గతంలోనే అనుమతులు లభించినందున నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు.

Similar News

News December 18, 2025

కలెక్టర్‌ను వెంటబెట్టుకుని సీఎంను కలిసిన పవన్ కళ్యాణ్

image

కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పవన్ ఆప్యాయంగా చేతితో పట్టుకుని సీఎం వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News December 18, 2025

విజనరీ లీడర్‌కు కంగ్రాట్స్: పవన్

image

AP: ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు <<18602632>>ఎంపికైన<<>> సీఎం చంద్రబాబుకు Dy.CM పవన్ కంగ్రాట్స్ చెప్పారు. IT, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన పాలనలో ఆయన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ‘CBN ఒక విజనరీ లీడర్. ఆయన పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తోంది. దేశం, రాష్ట్రాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు ఆయనకు బలం చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.

News December 18, 2025

వారికి నీళ్లిచ్చి మీ బాటిల్ సంగతి చూద్దాం: CJI

image

ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్ బాటిళ్లకు WHO ప్రమాణాలు పాటించేలా FSSAIని ఆదేశించాలని దాఖలైన పిల్‌పై CJI ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది అర్బనైజ్డ్ రిచ్ ఫోబియా’ పిల్ అని పేర్కొన్నారు. ‘ముందు దేశంలో తాగేందుకు మంచి నీళ్లు లేని వారి గురించి ఆలోచిద్దాం. బాటిళ్ల సంగతి తర్వాత చూద్దాం. గాంధీ తొలిసారి దేశానికి వచ్చి కుగ్రామాలకు వెళ్లినట్లు మీరూ పర్యటిస్తే పరిస్థితి తెలుస్తుంది’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.