News July 12, 2024
KNRలో ముంబై పోలీసులు.. కీలక ముఠా అరెస్టు

ముంబైలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు KNRలో బయటపడ్డాయి. అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసంలో భాగంగా భారీనగదు బదిలీచేసిన ముఠాలోని కీలక వ్యక్తులను KNRలో పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన ఇద్దరు CIలు, ఇద్దరు SIలు, నలుగురు కానిస్టేబుళ్లు విచారణ జరిపి పలు వివరాలను సేకరించారు. అనంతరం ఇద్దరిని వదిలేసి, ఒకరిని అదుపులోనే ఉంచారు. ఇదే కేసులో కీలకంగా భావిస్తున్న మహిళ కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 14, 2025
KNR: ‘పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో నమోదు పెరగాలి’

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంఈఓలు, ఎంపీడీవోలు, సీడీపీవోలతో పూర్వ ప్రాథమిక పాఠశాలలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ కేంద్రాలలో నమోదును పెంచాలని, ప్రతి కేంద్రంలో 20 మంది పిల్లలు తగ్గకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తదితరులు ఉన్నారు.
News October 14, 2025
17న కరీంనగర్లో క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి కార్యక్రమం

కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘FERIA FIESTA 2 – SWADESI UTSAV’ (క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి) పేరుతో ఈ నెల 17న కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం FERIA FIESTA 2 – SWADESI UTSAV పోస్టర్ను శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి తదితరులున్నారు.
News October 13, 2025
KNR: యూనిసెఫ్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

యూనిసెఫ్ సహకారంతో జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15న గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహణ, స్వచ్ఛ హరిత విద్యాలయాల నమోదు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.