News February 25, 2026

KNR: అగ్రనేతల లొంగుబాటు.. అజ్ఞాతంలో మిగిలింది ఒక్కరే!

image

పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీ వరకు దశాబ్దాల పాటు ఉద్యమ గమనాన్ని శాసించిన ఉమ్మడి KNR జిల్లా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు కేంద్ర కమిటీ(సీసీ)లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలోనే చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్‌రావు బయటకు రాగా.. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి ఒక్కరే అజ్ఞాతంలో మిగిలారు.

Similar News

News April 16, 2026

బోధన్: వైద్య సిబ్బందికి HMISపై శిక్షణ

image

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.

News April 16, 2026

SRPT: పోలీస్‌ స్టేషన్‌కు పట్టిన ‘గ్రహణం’ వీడేనా?

image

చిలుకూరులో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో స్టేషన్‌, సిబ్బంది క్వార్టర్ల కోసం ప్రభుత్వం మూడెకరాలు కేటాయించింది. 2017లో రూ.1.30 కోట్లతో పనులు ప్రారంభించినా, నిధుల విడుదలలో జాప్యంతో పిల్లర్లకే పరిమితమైంది. 2020లో రీటెండర్‌ వేసి స్లాబ్‌ పూర్తి చేసినప్పటికీ.. గత మూడేళ్లుగా పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.

News April 16, 2026

SRPT: పోలీస్‌ స్టేషన్‌కు పట్టిన ‘గ్రహణం’ వీడేనా?

image

చిలుకూరులో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో స్టేషన్‌, సిబ్బంది క్వార్టర్ల కోసం ప్రభుత్వం మూడెకరాలు కేటాయించింది. 2017లో రూ.1.30 కోట్లతో పనులు ప్రారంభించినా, నిధుల విడుదలలో జాప్యంతో పిల్లర్లకే పరిమితమైంది. 2020లో రీటెండర్‌ వేసి స్లాబ్‌ పూర్తి చేసినప్పటికీ.. గత మూడేళ్లుగా పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.