News July 25, 2024

KNR: ఆగస్టు 1 నుంచి బీపీఈడీ పరీక్షలు

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే బీపీఈడీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవనున్నాయి. యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ బ్రాంచ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు SU పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News December 15, 2025

KNR: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పూర్తి చేశారు. డీపీఓ జగదీశ్వర్‌తో సమీక్ష జరిపి, ఎన్నికలు జరిగే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు సహా అన్ని ఏర్పాట్లపై చర్చించారు.

News December 15, 2025

హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

image

​KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.