News February 20, 2025
KNR: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్ పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్ పదోతరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Similar News
News November 21, 2025
7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.
News November 21, 2025
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికలు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46 ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 21, 2025
HYD: ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని అన్నారు. వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.


