News February 20, 2025

KNR: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్ పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్ పదోతరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

Similar News

News November 21, 2025

BREAKING: భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

image

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏడీసీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

News November 21, 2025

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

image

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏసీడీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్ మంచి గుర్తింపు వచ్చింది.

News November 21, 2025

టాటా డిజిటల్‌లో భారీగా లేఆఫ్‌లు

image

టాటా గ్రూప్‌లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్‌‌లోనూ ఎంప్లాయీస్‌ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్‌ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.