News March 12, 2025
KNR: ఇంటర్ పరీక్షలకు 398 మంది గైర్హజరు!

కరీంనగర్ జిల్లా లో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్లో భాగంగా సెకండ్ ఇయర్ పేపర్2 మ్యాథమెటిక్స్, బోటనీ ,పొలిటికల్ సైన్స్ ప్రశాంతంగా ముగిసినట్లు బుధవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 16256 మంది విద్యార్థులకు 15858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 398 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 12, 2026
KNR: ఆర్ఎంపీ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ

తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకొని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండర్కు 25 రోజులు, డబుల్కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 11, 2026
KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్కు దూరంగా ఉండాలి’

డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.


