News August 4, 2024
KNR: ఈనెల 5న ప్రజావాణి రద్దు

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం (ఆగస్టు 5వ తేదీన ) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ వివరించారు.
Similar News
News December 16, 2025
కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.


