News May 12, 2024
KNR: ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
News February 12, 2025
కరీంనగర్: బీసీ స్టడీ సర్కిల్లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ కోసం 539 మంది దరఖాస్తు చేసుకున్నారని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ వరకు స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. 15 నుంచి తరగతులు ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..
News February 12, 2025
KNR: కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంత్తు

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.