News February 4, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్ల నిర్వహణ తదితర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ బందోబస్తు, బారీకేడ్ల ఏర్పాటుపై పోలీసు అధికారులతో చర్చించారు.
Similar News
News December 8, 2025
జిల్లాలో 100% ఓటింగే లక్ష్యం: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% ఓటింగ్ ఎలక్షన్ గా ప్రతి ఒకరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని, ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులను చూపి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికలలో 90.14 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఉన్నారు.
News December 8, 2025
ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News December 8, 2025
మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.


