News April 15, 2024
KNR: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.
Similar News
News August 23, 2025
KNR: పిల్లలకు భోజనాన్ని వడ్డించిన కలెక్టర్

దుర్షెడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. వారందరికీ రోజువారీగా అందించే భోజనాన్ని స్వయంగా వడ్డించారు. సిలబస్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు కొలవాలని అన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.
News August 22, 2025
KNR: వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు సబ్సిడీ

వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ స్మామ్–2025 పథకం కింద 2,822 బ్యాటరీ, మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోట వేటర్లు, 32 సీడ్ కంఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, ఇతర పరికరాలు ఉన్నాయన్నారు. చిన్న, సన్నకారు, మహిళా, SC, ST రైతులకు 50% సబ్సిడీ, ఇతర రైతులకు 40% సబ్సిడీ కల్పించనున్నట్టు తెలిపారు.
News August 22, 2025
కాచాపూర్: ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య కడుపు నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.