News March 18, 2025

KNR: కొత్త కాన్సెప్ట్‌కు జిల్లా కలెక్టర్ శ్రీకారం..

image

KNRలోని కాశ్మీర్ గడ్డ రైతుబజార్ ఒక అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడ ఒక వినూత్నమైన కొత్త కాన్సెప్ట్‌తో కూరగాయల సంతను ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల సంతను ఏర్పాటు చేసింది.. రైతులో.. గ్రామీణ ప్రాంత ప్రజలో కాదు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు. కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఎంపిక చేసిన 12ప్రభుత్వ పాఠశాలల నుంచి 60మంది విద్యార్థులతో ఏర్పాటు చేయించారు.

Similar News

News March 19, 2025

కరీంనగర్ ఏసీపీ నరేందర్‌కు ప్రమోషన్

image

కరీంనగర్ టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపతి నరేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. పదోన్నతిపై ఆయనను హైదరాబాదులోని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సందర్భంగా నరేందర్ కు కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

News March 19, 2025

KNR: ఉద్యోగులు శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పరిధిలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆధునికరించారు. ఆధునికరించిన ఈ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు.

News March 18, 2025

సైదాపూర్: నీటిసంపులో పడి బాలుడి మృతి

image

నీటిసంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయినా కన్పించకపోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యమైంది.

error: Content is protected !!