News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

Similar News

News December 13, 2025

KNR: 567 మంది మహిళలు మాయం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

News December 13, 2025

KNR: స్వచ్ఛ హరిత రేటింగ్‌.. 8 పాఠశాలలు ఎంపిక

image

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్‌కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News December 13, 2025

KNR: స్వచ్ఛ హరిత రేటింగ్‌.. 8 పాఠశాలలు ఎంపిక

image

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్‌కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.